వరంగల్ రూరల్ : జిల్లాలోని శాయంపేట మండలం, మందారిపేట శివారులో హన్మకొండ నుంచి జయశంకర్ భూపాలపల్లి కి వెళ్తుండగా లారీ – ఆర్టీసి బస్సు ఢీ కొన్న ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడటం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఎంజీఎం వైద్య అధికారులతో మాట్లాడారు.
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయాలపాలైన వారికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి కారణాన్ని తెలుసుకుని కారకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా