రంగారెడ్డి : సీఎం కేసీఆర్ కృషితో చేపట్టిన హరితహారంతో తెలంగాణలో అడవుల శాతం పెరిగిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హరితహారంపై కలెక్టరేట్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో 7 వ విడత హరితహారంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటాలన్నారు. అలాగే లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటిని కాడాలని అధికారులు అధికారులను ఆదేశించారు.
హరితహారాన్ని విజయవంతం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. పట్టణాల్లో కూడా ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలి. నర్సరీ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
గ్రామ స్థాయిలో వార్డు సభ్యుల నుంచి ,సర్పంచ్ ల వరకు, కౌన్సిలర్ల నుంచి చైర్మన్ ల వరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ , జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి ,చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా