వరంగల్ అర్బన్ : చారిత్రక నగరంవరంగల్లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి జెఎన్ఎస్ స్టేడియంలో పనులు పరిశీలించి మాట్లాడారు. వినోద్ కుమార్ కృషితో అప్పటి ఎంపీ నిధుల నుంచి 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు.
అతి త్వరలో సింతటిక్ ట్రాక్ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి జెఎన్ఎస్ స్టేడియానికి క్రీడాకారులు వస్తుంటారు. అతి త్వరలోనే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని పున:ప్రారంభించడానికి సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్, సీపీఐల నుంచి టీఆర్ఎస్లో చేరికలు
గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోర్న్ స్టార్
యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు
భాగవత పద్యాలతో మంత్రముగ్ధుల్ని చేసిన సింగపూర్ చిన్నారులు