జనగామ : పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు రావడం లేదు.
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆరెస్ జనరల్ సెక్రటరీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. కోకాపేట భూముల వేలంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. కోకాపేట భూముల టెండర్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నారు. ఆన్లైన్ టెండరింగ్లో రేవంత్ రెడ్డి వంద కోట్లకు ఎకరా వేయంగా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. టెండర్ల విధానం తెలంగాణ ఒక్కటే కాదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నాయన్నారు.
హైదరాబాద్లో ఉన్న రియల్ భూమ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాలకు కూడా లేదన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.7 నుంచి 14 కోట్లు మినిమమ్ ధర పెట్టారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి దిక్కుమాలిన విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. భూ అమ్మకాలపై అన్ని రకాల ప్రకటనలు ప్రభుత్వం చేసిందన్నారు.
రూ. 5 కోట్ల డిపాజిట్ చేసి టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంది. ఒకరు వేసిన టెండర్లు మరొకరికి ఆన్లైన్ అయినా పారదర్శకంగా టెండరింగ్ జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ లో భూములు అమ్మి ఆంధ్రకు ఖర్చు చేశారు కాబట్టే ఆనాడు భూ అమ్మకాలను అడ్డుకున్నామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ను తగ్గించే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరించొద్దన్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్, సీపీఐల నుంచి టీఆర్ఎస్లో చేరికలు
గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోర్న్ స్టార్
యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు
భాగవత పద్యాలతో మంత్రముగ్ధుల్ని చేసిన సింగపూర్ చిన్నారులు