మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మహబూబాబాద్ పట్టణం, గూడూరు మండలానికి చెందిన 100 మంది కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటామన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, గోగుల రాజు, కాట భాస్కర్, సురేందర్, కవిత, తదితరులు పాల్గొన్నారు.