వరంగల్ అర్బన్ : వరంగల్ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19, 20,21, 24,25, 26, 28, 36, 33, 42, 41, 39, 34 డివిజన్లలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరంగల్ మున్సిపాల్టీలో గతంలో ఎన్నడు జరుగని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలోనే జరుగుతుందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటుకున్న అంబులెన్స్ డ్రైవర్
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం