మంచిర్యాల : జిల్లా కేంద్రంలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తికి తలకొరివిపెట్టి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకడంతో తీవ్ర అస్వస్థతతకు గురయ్యాడు. దీంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు అంబులెన్స్ డ్రైవర్ గాంధీని సంప్రదించారు.
మృతదేహాన్ని అంబులెన్స్లోకి ఎక్కించిన తర్వాత కుటుంబ సభ్యులు ఇక్కడే దహన సంస్కారాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. తీరా శ్మశానవాటికకు వెళ్లాక.. తమ వల్ల కాదు మీరే ఈ కార్యక్రమాన్నీ పూర్తి చేయాలని డ్రైవర్ గాంధీని కోరారు. దీంతో చేసేదేమీ లేక గాంధీ దగ్గరుండి దహన సంస్కారాలు పూర్తిచేశారు.
అనంతరం ఆయనకు కుటుంబ సభ్యులు చేతులతో నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమం తలపెట్టిన గాంధీని మంచిర్యాల ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ నాయకులు అభినంధించారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం