Accident | సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది (Accident). రాజీవ్ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
సిద్దిపేట నుంచి హైదరాబాద్ (Hyderabad) వైపు అతివేగంగా వెళ్తున్న కారు (Speeding Car ) కుకునూర్ పల్లి వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. రాజీవ్ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ.. అవతలవైపు ఎదురుగా వస్తున్న మరోకారును బలంగా ఢీకొట్టింది. అనంతరం గాల్లో ఎగిరి బలంగా రోడ్డుపై పడింది.
ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. క్షతగాత్రుల్ని కరీంనగర్ డెయిరీ అడ్వైజర్ హన్మంతరెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డ్రైవర్ శోభన్, ప్రశాంత్ గా గుర్తించారు.
Also Read..
Jan Vishwas Yatra | తేజస్వి జన్ విశ్వాస్ యాత్రలో అపశ్రుతి.. ఎస్కార్ వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి
AP MLAs Disqualification | తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. ఏపీ స్పీకర్ తమ్మనేని నిర్ణయం..