Jan Vishwas Yatra | బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ చేపట్టిన జన్ విశ్వాస్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకున్నది. పూర్నియా బెలౌరిలో తేజస్వీ యాదవ్ ఎస్కార్ట్లోని వాహనం అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన పోలీస్ సిబ్బందిని పూర్నియా జీహెచ్సీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుడిని మహ్మద్గా గుర్తించారు. ఎస్కార్ట్లో ఉన్న వాహనం అకస్మాత్తుగా అదుపు తప్పి డివైడర్పై నుంచి దూసుకెళ్తో మరో మార్గంలో వెళ్తున్న కారును ఢీకొట్టిందని స్థానికులు పేర్కొంటున్నారు. కారులో వ్యక్తులతో పాటు ఎస్కార్ వాహనంలో ఉన్న పోలీసులకు సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.