AP MLAs Disqualification | ఏపీకి చెందిన అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన ఆయన అనర్హత వేటు వేశారు. ఇటీవల ఆయా పిటిషన్పై విచారణ జరిపారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ, టీడీపీ స్పీకర్కు పిటిషన్లు ఇచ్చాయి.
ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, శ్రీదేవిపై వైఎస్సార్సీపీ, మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్లపై టీడీపీ ఫిర్యాదు చేసింది. పిటిషన్ లపై విచారణను ముగించిన స్పీకర్, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ ఇవ్వగా.. ఈ మేరకు స్పీకర్ అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.