Nallagonda | నల్లగొండ : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మిర్యాలగూడెం మండలం దిలావర్పూర్ గ్రామానికి చెందిన గందం శ్రీనివాస్ (33) నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా, అదే వైపు నుంచి వస్తున్న కారు మిర్యాలగూడ వైపు అతివేగంగా వెళతూ వెనుక నుంచి బైక్ను ఢీ కొట్టింది. అనంతరం కారు రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది.
కారు నుజ్జునుజ్జు కాగా… ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న శ్రీనివాస్ కొద్ది దూరంలో ఎగిరిపడి చనిపోయారు. కారులో ఉన్న మరో మహిళ సైతం కారులో నుంచి ఎగిరి పక్కనే ఉన్న పొలాల్లో పడి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. కారులోని మరో ఇద్దరికి సీరియస్గా ఉండటంతో, చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | బాగా చెప్పారు కేటీఆర్ గారూ.. కాంగ్రెస్ అంటేనే చీటింగ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Yadadri Bhuvanagiri | ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో భారీ పేలుడు.. ఒకరు మృతి
KTR | అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా..? రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజం