Yadadri Bhuvanagiri | యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో సంభవించిన పేలుడు ధాటికి ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడిని బచ్చన్నపేట్ గ్రామానికి చెందిన ఎం కనకయ్యగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న ప్రకాశ్ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మిగతా కార్మికులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ఎమర్జెన్సీ సైరన్తో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను అప్రమత్తం చేసింది. దీంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. బాధితుల కుటుంబాలు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
KTR | అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా..? రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజం
Cold Wave | తెలంగాణను వణికిస్తున్న చలి.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
KTR | ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం : కేటీఆర్
JL Recruitment | సీఎం ఆమోదం లేక నిలిచిన జేఎల్ల భర్తీ.. అపాయింట్మెంట్ ఆర్డర్ల జారీలో జాప్యం