HYDRA officials | నిరుద్యోగులు(Unemployed) అంతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు అధికారులకు అలుసుగా మారింది. కనీస మర్యాద పాటించకుండా వారిపట్ల ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగుల పట్ల అధికారులు(HYDRA officials) దురుసుగా ప్రవర్తించారు. ఎక్కువ మాట్లాడే కొడుకులను ఐడెంటిఫై చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. టోకెన్లు ఉన్నవాళ్లు ఉండండి, లేని వాళ్లు బయటికి వెళ్లిపోండి అంటూ అహంకారపూరితంగా మాట్లాడారు.
వివరాల్లోకి వెళ్తే.. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టుల కోసం సరూర్నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటించింది. దీంతో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సరైన చర్యలు చేపట్టని అధికారులు ఇంత మంది వస్తే ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు? అని అసహనం వ్యక్తం చేశారు.
ఇంత మంది వస్తే ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు?
ఎక్కువ మాట్లాడే కొడుకులను ఐడెంటిఫై చేస్తాము
టోకెన్లు ఉన్నవాళ్ళు ఉండండి, లేని వాళ్లు బయటికి వెళ్ళిపోండి
సరూర్ నగర్ స్టేడియంలో హైడ్రా డ్రైవర్ ఉద్యోగాలకు భారీగా నిరుద్యోగులు తరలి రావడంతో వారితో దురుసుగా ప్రవర్తించిన అధికారులు https://t.co/erRLrEhbSX pic.twitter.com/ScNu3ybH3c
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026