యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రాయగిరి దగ్గర హైవేపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టిటడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.
గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కు తరలించారు. మృతులు వరంగల్ జిల్లా కేసముద్రం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..