గజ్వేల్, జూన్ 4: కొవిడ్ నియంత్రణకు చిరు వ్యాపారులకు టీకా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్సూచనల మేరకు చిరు వ్యాపారుల పేర్లు, ఆధార్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. శుక్రవారం గజ్వేల్ ఇంటిగ్రేటె డ్మార్కెట్ యార్డ్లో పండ్లు, పూలు, కూరగాయలు, మాం సం, చేపల విక్రయ వ్యాపారుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేశారు.
మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కమిషనర్ వెంకటగోపాల్, నాయకులు నర్సింగ్, కౌన్సిలర్ గోపాల్రెడ్డి తదితరులు మార్కెట్యార్డ్లో జరిగిన వ్యాపారుల పేర్లను ఆన్లైన్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ఇతర వ్యాపారులకు కూడావ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు, ఇప్పటివరకు వాక్సిన్ తీసుకోని వ్యాపారులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు సూచించారు.
ముమ్మరంగా సూపర్స్ప్రెడర్ల గుర్తింపు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలో పలు వార్డుల్లోశుక్రవారం సూపర్స్ప్రెడర్ల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా 41వ వార్డులో కౌన్సిలర్ సాయన్నగారి సుందర్ ఆధ్వర్యంలోనిర్వహించారు. ముఖ్యంగా మటన్షాప్, స్వీట్షాప్, బట్టలు ఇస్త్రీ చేసేవారు, మున్సిపల్ కార్మికులు, కూరగాయలు అమ్మేవారు,బట్టలు అమ్మేవారు, తోపుడు బండ్ల వ్యాపారులు తదితరులకు ప్రత్యేక క్యాంపులో భాగంగా కొవిడ్ టీకాలు ఇప్పించేందుకుప్రత్యేక సర్వే చేసి రిజిష్ర్టేషన్ చేశారు. వీరందరికీ శనివారం బాలాజీ గార్డెన్లో టీకాలు ఇస్తారని కౌన్సిలర్ సాయన్నగారి సుందర్తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీసర్ శ్రవణ్, సోషల్మీడియా ఇన్చార్జి వీరబత్తిని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.14వ వార్డులో కౌన్సిలర్ అలకుంట్ల మహేందర్ ఆధ్వర్యంలో సూపర్స్ప్రెడర్ల గుర్తింపు చేపట్టి ఆన్లైన్లో పేర్లు నమోదు చేశారు.