ములుగు : భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి 163 పైకి గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.
గోదావరి వరద నీరు హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే జాతీయ రహదారి పైకి వాజేడు మండలంలోని పావురాల వాగు బ్రిడ్జి పైకి చేరడంతో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ