మేడ్చల్ మల్కాజిగిరి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో కూతురు సహా భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఓ కుటుంబం బైక్పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు కూతురు మృతి చెందింది. ఈ ప్రమాదంలో వారి కుమారుడి కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్