కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం లోడ్పల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉదయం మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసింది. పులి దాడిలో మండురి అర్జయ్య, రామయ్య, మోర్ల మల్లేష్కు చెందిన మూడు పశువులు మృతి చెందాయి. గమనించిన స్థానికులు కర్రలతో పులిని అడవిలోకి తరిమారు. కాగా, మళ్లీ పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు