హైదరాబాద్ : ఇండోనేషియాలో గురువారం(ఏప్రిల్2) తెల్లవారుజామున భారీ భూకంపం(Indonesia quake ) సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపంతో ఒకరు చనిపోయారు. మరికొన్ని ఇండ్లు ధ్వంసమయ్యాయి. 75 సెం.మీ. ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. టెర్నెట్ ద్వీపానికి 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని యూఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది . దీంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా ప్రభుత్వాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. అప్రమత్తమైన స్థానిక అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Internet Shutdowns | భారత్లోనే అత్యధికంగా ఇంటర్నెట్ షట్డౌన్లు!
Adivi Sesh | లవ్ ఫెయిల్యూర్ వెనుక ఉన్నస్టోరీ బయటపెట్టిన అడివి శేష్.. కెనడా వరకు వెళ్లిన ప్రేమ!
Commercial cylinders | వాణిజ్య సిలిండర్పై మళ్లీ బాదుడు..ఏకంగా రూ.195.5 పెంపు