హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బాలాపూర్, నాదర్గుల్ వద్ద ఉన్నవి ప్రభుత్వ భూములేనని, వాటిలో అక్రమ నిర్మాణాలు ఎలా చేపడుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడారు. ఈ నెల 15 తర్వాత క్యూర్ పరిధిలో కబ్జాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేయనున్నట్టు చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కోర్టు సీరియస్ అయినా తీరు మారలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి హిట్లర్, హైడ్రా, హిల్ట్ పాలనను తీసుకొచ్చారని, ఇవన్నీ ప్రస్తుతం హాల్ట్లో పడ్డాయ ని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ వర్షాల కోసం వరుణ యాగం చేస్తే.. తాము రాష్ట్రంలో కాం గ్రెస్ కొట్టుకుపోవాలని యాగం చేస్తామన్నా రు. వానకాలం పోయాక కొత్త నాటకానికి సీ ఎం తెరలేపారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై స్పందిస్తూ.. రెండేండ్ల తర్వాత ఎలాగూ మారుస్తారని పేర్కొన్నారు.