సంగారెడ్డి, ఆగస్టు 10: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపధ్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్తో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ మైదానం, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణాలను సందర్శించారు. 15 ఆగస్టును పురస్కరించుకుని రాష్ట్రంలో అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలను జిల్లా కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్, ఎస్పీ సూచించారు. భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, వేదిక ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎస్పీ, జగ్గారెడ్డి కోరారు. కార్యక్రమంలో సంబంధిత ఆర్అండ్బీ అధికారులు, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, పోలీసుశాఖ సిబ్బంది పాల్గొన్నారు.