జనగామ : జనగామ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుందనే వార్త స్థానికంగా కలకలం రేపుతున్నది.
జిల్లాలోని గానుగుపహాడ్-వెంకిర్యాల అటవీ ప్రాంతంలో గురువారం రైతుల వ్యవసాయ బావుల వద్ద కొందరికి ఓ జంతువు పాదముద్రలు కనపించాయి. వాటిని బట్టి పులి సంచరిస్తున్నదని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి వాటి అడుగులను పరిశీలించారు. ఆ పాదముద్రలు జాకాల్ జాతికి చెందిన జంతువుదని గుర్తించారు. అవి కుక్క, నక్క, తోడేలు జాతికి చెందినవని తెలుపడంతో రైతులు, గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ములుగు జిల్లాలో బాలికపై లైంగికదాడి
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద