ములుగు : జిల్లాలోనివెంకటాపురం మండలానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు బండారుపల్లి సమీపంలో ఉన్న ఇటుక బట్టీల వద్ద కూలీ పనులు చేస్తూ నివాసముంటున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో బండారుపల్లి గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలుపగా బాలిక తల్లిదండ్రులు గురువారం ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, లైంగిక దాడి చట్టాల కింద కేసులు నమోదు చేశారు.