ములుగు : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శింకునేందుకు భక్తులు లక్షాదిగా దేశ నలుమూల నుంచి తరలివస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో భాగంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం లభిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అళ్లెం అప్పయ్య మాట్లాడుతూ..జిల్లాలో మేడారంతో పాటు పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బొగత జలపాతం వద్ద ప్రతి ఆది, బుధవారాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కరోనా టీకాల వివరాలు తెలుసుకొని మొదటి డోసు పూర్తయిన వారికి రెండవ డోస్ టీకాతో పాటు ఇప్పటివరకు మొదటి డోసు టీకాలు వేసుకొని వారికి టీకాలు వేస్తున్నట్లు వివరించారు.
టీకాలు వేసుకొని వారిని దర్శనానికి అనుమతించమన్నారు.
ఇవి కూడా చదవండి..
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్రావు
హిమాచల్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.9 కోట్ల ఆస్తి నష్టం
Manchu Vishnu: చెప్పినా వినలేదు, అందుకే రాజీనామాలని ఆమోదిస్తున్నా: మంచు విష్ణు