హైదరాబాద్ : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ పోస్టర్ను, TPUS రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..ఆరోగ్య తెలంగాణ కోసం ప్రజలు కూడా సహకరించాలన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు అందరు వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్కు తప్పని సరిగా పెట్టుకోవాలన్నారు. ప్రతి సమయంలో సానిటైజర్ వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, సంఘ సేవకులు కలిసి రావాలని, కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.
కోకాపేటలోని మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ భాస్కర్, కార్యదర్శి తలారి చైతన్య, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభా రెడ్డి , CONSTRUCTION విభాగం అధ్యక్షుడు గాంధాల శ్రీనివాస్ చారి, రియల్ ఎస్టేట్ విభాగం అధ్యక్షుడు వల్లెపు శ్రీనివాస్ వడ్డెర, TRSKV నాయకురాలు నిర్మలా రెడ్డి , మహిళ కో ఆర్డినేటర్ శాంతి, ప్రీతి, తదితరులు పాల్గొన్నారు .
ఇవి కూడా చదవండి..
అక్కడికి వెళ్లాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి
హిమాచల్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.9 కోట్ల ఆస్తి నష్టం
Manchu Vishnu: చెప్పినా వినలేదు, అందుకే రాజీనామాలని ఆమోదిస్తున్నా: మంచు విష్ణు