కొద్ది రోజుల క్రితం జరిగిన మా ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు తలపించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలలో మంచు విష్ణు…ప్రకాశ్ రాజ్పై ఘన విజయం సాధించారు. అయితే మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్లోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలని తాను ఆమోదించనని పదే పదే చెబుతూ వచ్చిన మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని క్లారిటీ ఇచ్చారు విష్ణు. అయితే ప్రకాష్ రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ వాళ్ల రిజైన్లను మాత్రం ఆమోదించలేదన్నారు విష్ణు. ‘మా’ బిల్డింగ్పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నారు.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచి రాజీనామా చేసింది వీరే
శ్రీకాంత్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
బెనర్జీ – వైస్ ప్రెసిడెంట్
ఉత్తేజ్ – జాయింట్ సెక్రటరీ
ఈసీ మెంబర్
శివారెడ్డి
బ్రహ్మాజీ
ప్రభాకర్
తనీష్
సురేశ్ కొండేటి
సమీర్
సుడిగాలి సుధీర్
కౌశిక్