Murder Plan | మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త, జీఎస్ఎమ్ ఫాయిల్స్ (GSM Foils) కంపెనీ ఎండీ మోహన్సింగ్ పర్మార్ (46)పై కాల్పుల జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సాగర్ గిరీష్ భానుశాలి (33), అతడికి సహకరించినవారిని అరెస్ట్ చేశారు. సాగర్ గిరీష్ భానుశాలి పర్మార్ కంపెనీలోని తోటి భాగస్వామి అని తెలిసి పోలీసులు ఖంగు తిన్నారు.
స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయిన సాగర్ గిరీష్ పర్మార్ నుంచి రూ. 32 కోట్లు తీసుకున్నాడు. పర్మార్ అప్పు ఎగ్గొట్టేందుకు, కంపెనీని చేజిక్కించుకునేందుకు పర్మార్ను హత్య చేయాలనుకున్నాడు. దీంతో కంపెనీ ఉన్న వసాయ్ (Vasai)లోని నాయక్పాడ ప్రాంతంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు పర్మార్పై కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ భుజానికి తలిగింది. మరోసారి కాల్పులు జరిపే ప్రయత్నంలో పిస్టల్ జామ్ అయ్యింది. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు సాగర్, అతడికి సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.