న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్లోని కుల్లూ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని మజ్హన్లో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించాయి. దీంతో మొత్తం 27 ఇండ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 పశువుల కొట్టాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.9 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రధాన రహదారికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరైన రవాణా మార్గం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టిందని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో నీటివసతి కూడా లేకపోవడంతో ప్రజలు మంటలను ఆర్పడానికి బురద చల్లడం, రాళ్లు విసరడం వంటి చేశారన్నారు. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.
అగ్నిప్రమాద ఘటనపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.