నల్లగొండ : అత్యవసర సమయాలలో ఎంతో మందికి రక్తాన్ని అందించి ప్రాణ దాత అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఎంతో ప్రశంసనీయమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. రెడ్ క్రాస్ భవన్ నల్లగొండ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్న ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణవాయువు అందక చనిపోతున్నారు.
ఈ తరుణంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఉచితంగా అందజేయాలని సంకల్పించడం అభినందనీయమన్నారు. సహజంగా పొందాల్సిన ప్రాణవాయువుని కృత్రిమంగా పొందాల్సిన పరిస్థితులకు రావడం ప్రమాదకర పరిస్థితులను నెట్టి వేయడమేనని పేర్కొన్నారు. ప్రజలంతా చెట్లను నాటి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, నాయకులు కటకం సత్తయ్య గౌడ్, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లి రామరాజు, బోయపల్లి శ్రీనివాస్ వట్టి పల్లి శ్రీనివాస్ పబ్బు సాయి శ్రీ సందీప్ , రావుల శ్రీనివాస్ రెడ్డి బంగారం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం : మంత్రి నిరంజన్ రెడ్డి