హైదరాబాద్ : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha swamy) వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించు కునేందుకు భక్తులు (Devotees) పోటెత్తారు. దీంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇంబ్బంది కలుగకుండా చూస్తున్నారు.