కీసర/మేడ్చల్ మల్కాజిగిరి : చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో పోటెత్తింది. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో చేరుకొని, స్వామివారికి నిర్వహించిన స్వర్ణపుష్పాభిషేకంలో పాల్గొన్నారు.
గర్భాలయంలో స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TTD | అలాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి : టీటీడీ
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు
Siddipet | నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ..గంటలోనే కేసును చేధించిన పోలీసులు