Minister KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు మొదలైంది. దీంతో ప్రజలు, సినీ రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ (Nandi Nagar)లో గల ఓ పోలింగ్ బూత్లో భార్యతో కలిసి ఓటు వేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే ఓటు వేశానని తెలిపారు. ‘తెలంగాణ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకుని నా బాధ్యత నెరవేర్చా. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశా. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయండి. ఓటు వేసి మీ హక్కును కాపాడుకోండి’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
#WATCH | Telangana minister and BRS MLA KT Rama Rao and his wife Shailima cast their votes in Nandi Nagar, Banjara Hills, Hyderabad pic.twitter.com/GWvwZeXzFR
— ANI (@ANI) November 30, 2023
Also Read..
Minister KTR | ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి.. ప్రజలకు కేటీఆర్ సందేశం
TS Assembly Elections | తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్.. తొలి రెండుగంటల్లో 8.52శాతం నమోదు
Minister Jagadish Reddy | సాగర్ నీటి విషయంలో మొండి వైఖరితో ఏపీ తొండి : మంత్రి జగదీశ్రెడ్డి