TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరుతున్నారు. పలుచోట్ల ప్రముఖులు ఓటువేశారు. ఇదిలా ఉండగా.. ఉదయం 9 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 8.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలక అధికారులు తెలిపారు.
8.52% voter turnout recorded in Telangana till 9am pic.twitter.com/8Mzve2eGmG
— ANI (@ANI) November 30, 2023
శేరిలింగంపల్లి 10శాతం, సంగారెడ్డిలో 11.34శాతం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 14.9శాతం, ఖైరతాబాద్లో 10శాతం, హుస్నాబాద్ నియోజకవర్గంలో 12.67శాతం, దుబ్బాకలో 10.06శాతం, సిద్దిపేటలో 11.50శాతం, గజ్వేల్లో 11.03శాతం, మేడ్చల్లో 2.4శాతం, మల్కాజ్గిరిలో 5.81శాతం, కుత్బుల్లాపూర్లో 8.5శాతం, ఉప్పల్లో 5శాతం, కూకట్పల్లిలో 5.32శాతం, కరీంనగర్ 6.13శాతం, మానకొండూర్ 10శాతం, హుజురాబాద్ 5.63 శాతం, చొప్పదండి 12.45శాతం, ధర్మపురి 8.80శాతం, జగిత్యాల 11.74శాతం, కోరుట్ల 11.83శాతం, మంథని 8.20శాతం, పెద్దపల్లి 12శాతం, రామగుండం 9.10శాతం, సిరిసిల్ల 10.71శాతం, వేములవాడ 9.85శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.