అర్వపల్లి, ఆగస్టు 14 : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో గురువారం సాయంత్రం బోనాల పండుగ సందర్భంగా ప్రజలంతా కలసి ఊరేగింపుగా బోనాలను ఎత్తుకొని వెళ్తుండగా బీఆర్ఎస్ యువజన కార్యకర్త గునగంటి చంద్రకాంత్గౌడ్, బీఆర్ఎస్ నాయకులపై కొంతమంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మాటువేసి దాడిచేశారు. దీంతో చంద్రకాంత్గౌడ్ తలకు తీవ్ర గాయమైంది. మరి కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే బాధితుడిని సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించంగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపారు. దీంతో తిమ్మాపురంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీ బం దోబస్తు ఏర్పా టు చేశారు. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమో దు చేసినట్టు అర్వపల్లి ఎస్సై మధు తెలిపారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమేశ్గౌడ్, రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్గౌడ్ తీవ్రంగా ఖండించారు.