Minister KTR | తెలంగాణలో జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో అంతా భాగస్వామ్యం కావాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు.
మీ ఓటు..
పరుగులు పెడుతున్న
తెలంగాణ ప్రగతికి
పునాదిగా నిలవాలి
మీ ఓటు..
తెలంగాణ ఉజ్వల భవితకు
బంగారు బాటలు వేయాలి
మీ ఓటు..
తెలంగాణ రైతుల జీవితాల్లో
వెలుగులు కొనసాగించాలి
మీ ఓటు..
వ్యవసాయ విప్లవానికి
వెన్నుముకగా నిలవాలి
మీ ఓటు..
మహిళల ముఖంలో
చెరగని చిరునవ్వులు నింపాలి
మీ ఓటు..
యువత ఆకాంక్షలను నెరవేర్చే
అవకాశాల అక్షయపాత్ర కావాలి
మీ ఓటు..
సబ్బండ వర్ణాల్లో..
సంతోషాన్ని పదిల పరచాలి
మీ ఓటు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని
సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలి
మీ ఓటు..
తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని
తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని
మరింత అందంగా తీర్చిదిద్దాలి
మీ చేతిలోని వజ్రాయుధాన్ని
ఎట్టి పరిస్థితుల్లో వృధాకానివ్వకండి
అందుకే..
ప్రజాస్వామ్య పండుగలో
భాగస్వామ్యం కండి..
అందరూ రండి..!
ప్రతి ఒక్కరూ
“ముచ్చటగా…”
ఓటు హక్కును వినియోగించుకొండి..!!
జై తెలంగాణ
జై భారత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్ నమోదైంది.
మీ ఓటు..
పరుగులు పెడుతున్న
తెలంగాణ ప్రగతికి
పునాదిగా నిలవాలిమీ ఓటు..
తెలంగాణ ఉజ్వల భవితకు
బంగారు బాటలు వేయాలిమీ ఓటు..
తెలంగాణ రైతుల జీవితాల్లో
వెలుగులు కొనసాగించాలిమీ ఓటు..
వ్యవసాయ విప్లవానికి
వెన్నుముకగా నిలవాలిమీ ఓటు..
మహిళల ముఖంలో
చెరగని చిరునవ్వులు నింపాలిమీ…
— KTR (@KTRBRS) November 30, 2023
Also Read..
TS Assembly Elections | ఓటేసిన సినీ ప్రముఖులు
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత.. ఏపీ పోలీసుల దౌర్జన్యం..!
TS Assembly Elections | తెలంగాణలో మొదలైన ఓట్ల పండగ..! పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు