హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సారా కిర్లూ ప్రత్యేక ఆహ్వానం మేరకుఈ రోజు జరిగిన జూమ్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో పారిశ్రామిక రంగ ప్రగతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయి పారిశ్రామిక పాలసీని అమలు చేస్తున్నదని ఆమె తెలిపారు. కరోనా సమయంలోనూ 1700 కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరిచాయని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ గా నిలచి వ్యవసాయ రంగంలోనూ నెంబర్ వన్ గా ఉందన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయాలను ఎమ్మెల్సీ గుర్తు చేశారు. అక్కడి విధానాలు, స్థానిక పద్ధతులులను అభినందించారు.
అయితే ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ప్రజా సంబంధాలు, వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుందని విరించారు. తెలంగాణ అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్లో పర్యటించాల్సిందిగా సారా కిర్లూను కవిత ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం మొక్కలకు నీళ్లు పట్టిన కలెక్టర్
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి