మహబూబాబాద్ : జిల్లాలోని మరిపెడ మండలం తండ ధర్మారంలో ఇటీవల లైంగికదాడికి గురై హత్యకు గురైన మోడు ఉష కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు వేగంగా విచారించి దోషులను పట్టుకున్నందుకు, అధికారులు సత్వరమే స్పందించినందుకు అభినందించారు.
బాగా చదువుకుని, కుటుంబానికి అండగా ఉంటుంది అనుకున్న అమ్మాయిపై అఘాయిత్యం చేసి, హత్య చేయడం అత్యంత దురదృష్టకరమని, ఆ కుటుంబానికి ఆ లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు ఇస్తామని, ఇప్పుడు 25 వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పారు.
మిగిలిన మొత్తం కేసు వివిధ దశల్లో ఇస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లల పట్ల ప్రభుత్వం ఒక నిఘా నేత్రంగా పని చేస్తుందన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మోడు ఉష విషయంలో దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, వాటిని చూసి ఇంకొకరు అలాంటి పనులు చేయకుండా ఉండేలా ఆ శిక్ష ఉంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని చెప్పారు. ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీరంగారెడ్డి, రామ్ లాల్, అఫ్జల్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జనార్దన్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నాగవాణి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్