మహబూబ్నగర్ : ఐకమత్యంతో పట్టణాలు, గ్రామాలలో అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో రూ. 3 లక్షల 80 వేల వ్యయంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సీ.సీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఒకప్పుడు పాలకొండ గ్రామాన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన 7 ఏళ్లలో పాలకొండలో పెన్షన్ల కిందనే సుమారుగా 10 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు.
అంతేకాక కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, వంటి పథకాల కింద రైతులు, ఇతర వర్గాలకు సహకారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. బైపాస్ రోడ్డు పూర్తిచేయడం, నూతన కలెక్టర్ కార్యాలయ భవనం పూర్తయిన వెంటనే పాలకొండ దశ మారుతుందని మంత్రి అన్నారు. గ్రామంలో అర్హులైన వారందరికీ పెన్షన్ల తో పాటు అన్ని పథకాలను అమలు చేస్తున్నామని, వాటన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా పాలకొండ ప్రజలు ఐకమత్యంగా ఉండాలని దానివల్ల గ్రామాలు, పట్టణాలు త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి వీలవుతుందని మంత్రి అన్నారు. గ్రామంలో సి.సి కెమెరాల ఏర్పాటుతో నిఘా వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ నరేందర్, సీఐ మహేశ్వరరావు, ఎస్ఐ రమేష్, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..