మల్యాల/ జగిత్యాల : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో వైశాఖ మాస బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయంలో అంతరంగికంగానే ఆలయ అనువంశిక అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక దూత ద్వార స్వామివారి ఆలయానికి పట్టువస్త్రాలను పంపించారు.
ఆలయ ప్రాంగణ మండపంలో త్రయహ్నిక త్రికుండాత్మక యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో మూల విరాట్ శ్రీ ఆంజనేయస్వామికి పంచామృత అభిషేఖం, ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా స్వామి వారిని అలంకరించారు.
కార్యక్రమంలో ఈవో చంద్రశేఖేర్, స్థాన చార్యులు జితేంద్రప్రసాద్, అనువంశిక అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి