మహబూబ్నగర్ : క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్లు పోయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. హరితహారం కార్యక్రమం కింద మొక్కలకు నీరు అందించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో మొక్కలకు నీళ్లు పెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణలో భాగంగా పట్టణాలు, గ్రామాలలో హరితహారం కింద నాటిన అన్ని రకాల మొక్కలకు నీరు పోయాలన్నారు.
అంతేకాకుండా సంస్థలు, ఇండ్లల్లో నాటిన మొక్కలకు కూడా నీళ్లు పోసి సంరక్షించాలని సూచించారు. ముఖ్యంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలకు నూటికి నూరు శాతం బతికించాలని, ప్రతి వారం క్రమం తప్పకుండా నీళ్లు పోసి ఎక్కడ ఒక్క మొక్క కూడా చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఆయా గ్రామాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలపై ఉందని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు లేనందున మొక్కలు చనిపోకూడదని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ టి.శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, సర్పంచ్ పెంటయ్య, ఉపసర్పంచ్ వెంకటయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి