HYDRAA | హైదరాబాద్ : హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా)కు విస్తృత అధికారాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం రాజ్భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బీ) సెక్షన్ను చేర్చుతూ ఆర్డినెన్స్ జారీ అయింది. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులు కాపాడే బాధ్యత అప్పగించారు. అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది.
హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఇక పై రోడ్లు, నాలాలు, పబ్లిక్ స్ట్రీట్స్, చెరువులు, ఖాళీ స్థలాలు, పబ్లిక్ పార్క్లు మొదలుగుని ఇతర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తుల ఆక్రమణకు గురవ్వకుండా పరిరక్షించేందుకు హైడ్రాకు చట్టబద్దత కల్పించిన… pic.twitter.com/DAYPTmTkFl
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2024
ఇవి కూడా చదవండి..
Farmer Family Suicide | ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలు.. రైతు కుటుంబం ఆత్మహత్య
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేస్తా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, మంత్రుల నోట్లోనే ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శలు