హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు పరిశీలన బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్ రావు ఉన్నారు. బృందంలో దేవేందర్ రావు ఉండటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని తెలంగాణ ఈఎన్సీ గుర్తు చేసింది. రాష్ట్ర ప్రాజెక్టుల పరిశీలన బృందంలో కే శ్రీనివాస్ ఉన్నారు. గతంలో కే శ్రీనివాస్పై తాము అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ అధికారికి ప్రాంతాలను ఆపాదించడం అనైతికం అని ఈఎన్సీ పేర్కొన్నది. ఎన్జీటీ ఆదేశాలను ఆలస్యం చేయడమే ఏపీ ఉద్దేశమని తెలంగాణ ఈఎన్సీ అభిప్రాయపడింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ పనులను కేఆర్ఎంబీ పరిశీలించాలి. రాయలసీమ పనుల పరిశీలనపై ఈ నెల 9వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ఈఎన్సీ కోరింది.
ఈ నెల 9వ తేదీన నిర్వహించబోయే కృష్ణా, గోదావరి బోర్డు సమావేశానికి హాజరు కావడం లేదని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల వివాదం కేసు సుప్రీంకోర్టు, ఎన్జీటీలో విచారణ ఉన్నందున భేటీకి రాలేమని తెలిపారు. బోర్డు సమావేశానికి మరో తేదీ ఖరారు చేయాలని ఈఎన్సీ కోరింది. వీలైనంత త్వరగా బోర్డును సమావేశపర్చాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం.