Road Accident | అమెరికా (America) లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్ నగర్ (Mahaboob Nagar)జిల్లా భూత్పూర్ మండలం కపెట్ట గ్రామానికి చెందిన బోయ మహేశ్ (25) (Boya Mahesh) పై చదువుల కోసం గత డిసెంబర్లో అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్ఎస్ (MS) చేస్తున్నాడు.
మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్తో కలిసి లాంగ్ డ్రైవ్కు వెళ్లాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందించారు. దీంతో కప్పట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మహేశ్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read..
Rahul Gandhi | పాస్పోర్ట్ కోసం కోర్టుకెళ్లిన రాహుల్ గాంధీ
Raghav Chadha | పరిణీతి నా జీవితాన్నే మార్చేసింది.. నటితో బంధంపై తొలిసారి స్పందించిన ఆప్ ఎంపీ
Road Accident | లోయలో పడిన క్రూజర్ వాహనం.. ఆరుగురు మృతి