Road Accident | జమ్మూ కశ్మీర్లో (Jammu and Kashmir)ని కిష్త్వార్ (Kishtwar)లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
డంగుదురు పవర్ ప్రాజెక్ట్ (Dangduru Power Project)కు చెందిన 10 మంది కార్మికులు క్రూజర్ వాహనంలో వెళ్తున్నారు. డంగుదురు డ్యామ్ సైట్ (Dangduru Dam site) సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిష్త్వార్లో లోతైన లోయలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయడినట్లు కిష్త్వార్ పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలోని కేరి సెక్టార్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
J&K | A cruiser vehicle of Pakal Dul Project with 10 people on board, met with an accident in Kishtwar, some feared dead. Further details awaited: DC Kishtwar pic.twitter.com/AAQICSgdhS
— ANI (@ANI) May 24, 2023
Also Read..
Vaibhavi Upadhyaya: ఫేమస్ టీవీ నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మృతి
Manipur | భయం గుప్పిట మణిపూర్.. ఘర్షణల్లో ఇప్పటి వరకు 70 మంది మృతి