మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్కు చెందిన యూవీ కెన్ ఫండేషన్ (You We Can Foundatiton) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖానకు 50 క్రిటికల్ కేర్ బెడ్ లతో పాటు కోటి రూపాయల విలువైన ఇతర అత్యవసర వైద్య పరికరాలను హాస్పిటల్కు సమకూర్చారు.
యూవీ కెన్ ఫండేషన్ ఆధ్వర్యంలో ఈ క్రిటికల్ కేర్ బెడ్లను ప్రారంభించాలని ఫౌండేషన్ తెలంగాణ హెడ్ సృజన్ కుమార్ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ను తన నివాసంలో కలసి ఆహ్వానించారు. ఐసీయూ బెడ్లను త్వరలోనే ప్రారంభించడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. అలాగే ఫౌండేషన్ను అభినందించారు.
నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఆధునిక వైద్యం అందించాలనే సేవాభావంతో ఈ ఐసీయూ బెడ్లను సమకూర్చిన యువరాజ్ సింగ్కు ఫౌండేషన్ సభ్యుల ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్కు చెందిన వెంకటేష్, ప్రసన్న, చరణ్, శివ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?