నాగర్ కర్నూల్ : అనాథ పిల్లల సంరక్షణ, సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్ డెస్క్ నెం . 040-23733665 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వెంటనే స్పందించి గుర్తించిన అనాథ పిల్లలకు ఆశ్రయం, సంరక్షణ కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పించే విధంగా చర్యలు తీసుకుంటారని తెలియజేసారు.
కరోనాతో తల్లిదండ్రులను గాని తమ వారిని కోల్పోయిన పిల్లలు, లేదా మరే ఇతర కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం, బాగోగులు చుసుకోవడంతో పాటు తగిన సంరక్షణ కల్పిస్తుందన్నారు. ఈ హెల్ప్ డెస్క్ తో పాటు 24 గంటలు పని చేసే చైల్డ్ లైన్ నెం 1098 కు సైతం టోల్ ఫ్రీ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.
ప్రజలు తమకు తెలిసిన అనాథ పిల్లలు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన వారిని గుర్తించినట్లయితే వెంటనే పై హెల్ప్ డెస్క్ కు గాని టోల్ ఫ్రీ నెంబర్ కు గాని సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు