వనపర్తి : జిల్లాలోని పాన్గల్ మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారాన్ని అందించారు. లక్ష్మిని అంబులెన్స్ లో వనపర్తి జిల్లా దవాఖానకు తరలిస్తున్న క్రమంలో నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. లక్ష్మి పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. తమ బిడ్డకు ప్రసవం చేసిన 108 అంబులెన్స్ సిబ్బందికి లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
అనసూయ గ్లామర్ షో.. మైమరచిపోతున్న ఫ్యాన్స్
కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్