జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లారీని బస్సులు ఢీ కొట్టడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద లారీ యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు(Private travel buses) ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో తిరుపతి వెళ్తున్న బస్సు డ్రైవర్ కాళ్లు విరిగాయి. సుమారు 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూల్లోని హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..