హైదరాబాద్: వైరస్ విజృంభణ, కరోనా టీకాల కొరతతో ఇబ్బందిపడుతున్న భారత్కు కాస్త ఊరట లభించనుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు ఇవాళ దేశానికి చేరుకోనున్నాయి. రష్యా నుంచి హైదరాబాద్కు ఇవి వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో 50 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్పుత్నిక్ వీ టాకాను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రూపొందించింది. ఈ టీకా భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ కోసం డాక్టర్ రెడ్డీస్ రష్యాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్లో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. కాగా, రష్యా నుంచి భారీ సంఖ్యలో డోసులు రానున్నటంతో దేశంలో టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..