మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్- జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, 9వ వార్డ్ కౌన్సిలర్ చైతన్య చౌహన్ తో కలిసి నక్కలబండ తండాను ఎమ్మెల్యే సందర్శించ్చారు. గతంలో రోడ్డు విస్తీర్ణలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేదా స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ను పిలిపించి మాట్లాడారు. నక్కల బండ తండా వాసులకు ఇబ్బంది లేకుండా రోడ్డు పనులు చేపట్టాలని ఆయన వారికి సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
పేదలకు భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్ కేంద్రాలు